హైదరాబాద్: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ అన్ లిమిటెడ్ డాటా ఆఫర్ను ప్రకటించింది. డాటా సునామీ ప్లస్ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ పరిధిలోకి రావాలంటే రూ.318తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. 84 రోజుల కాలపరిమితి కలిగిన ఈ ఆఫర్లో రోజుకు 2 జీబీల డాటా లభించనున్నది. 2జీబీ డాటా అనంతరం ఇంటర్నెట్ వేగం 40 కేబీపీఎస్కి పడిపోనున్నది. ఈ ఆఫర్ బుధవారం నుంచి 90 రోజుల వరకు చెల్లుబాటు కానున్నదని ఒక ప్రకటనలో వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm