మేడ్చల్: జిల్లాలోని ఇంటర్ ఆపై ఉన్నత విద్యను అభ్యసిస్తున్న దివ్యాంగుల నుంచి 4జీ స్మార్ట్ ఫోన్ శిక్షణకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి స్వరూపరాణి తెలిపారు. వయస్సు 18 నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలని, పట్టణ ప్రాంతాల వారి ఆదాయం రూ. 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల వారి ఆదాయం రూ.1.5 లక్షలలోపు ఉండడంతో పాటు రేషన్ కార్డు, సదరం సర్టిఫికెట్, బోనోఫైడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని అన్నారు. అర్హులైన దివ్యాంగులు మేడ్చల్ కలెక్టరేట్లోని బి బ్లాక్లో గల జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో ఈనెల 29లోపు దరఖాస్తు అందజేయాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm