హైదరాబాద్ : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఆశించిన స్థాయిలో సాగటం లేదు. కెరీర్ స్టార్టింగ్లో వరుస సినిమాలతో హల్చల్ చేసిన ఈ సుప్రీం హీరో తరువాత డీలా పడిపోయాడు. వరుస ఫ్లాప్లు ఎదురుకావటంతో కెరీర్ కష్టాల్లో పడింది. ఇటీవల చిత్రలహరితో కాస్త పరవాలేదనిపించినా సూపర్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు.
ప్రస్తుతం కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సాయి. ఈ సినిమా తరువాత దేవ కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వెన్నెల, ప్రస్థానం సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న దేవాకట్టా తరువాత ఆటోనగర్ సూర్య, డైనమైట్ సినిమాలతో డిజాస్టర్లు ఇచ్చాడు. దీంతో చాలా గ్యాప్ వచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 19,2019 10:49AM