వాషింగ్టన్: భారత ఐటీ నిపుణులకు మేలు చేసేలా ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదించింది అగ్రరాజ్యంలో ట్రంప్ సర్కార్. గ్రీన్కార్డుల జారీలో ఉద్యోగుల ప్రతిభ ఆధారంగా ఇచ్చే కోటాను 12 శాతం నుంచి 57శాతానికి పెంచేందుకు చర్యలు ముమ్మరం చేశారు. ఈ మేరకు ట్రంప్ అల్లుడు, సీనియర్ సలహాదారు జారెద్ కుష్నెర్ శ్వేతసౌధంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తెలిపారు.
ట్రంప్ ఆదేశాలతో వలస సంస్కరణలకు ప్రాజెక్టుకు కుష్నెర్ హెడ్గా ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చివరి దశలో ఉండగా.. త్వరలోనే కాంగ్రెస్ ముందుకు తీసుకొచ్చేందుకు ట్రంప్ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. దీంతో ప్రతిభ ఉన్నవారు గ్రీన్కార్డులు పొందే అవకాశం ఉంటుందని, అంతేగాక.. వచ్చే 10ఏళ్లలో అమెరికా పన్ను ఆదాయం కూడా 500 బిలియన్ డాలర్లు పెరుగుతుందని కుష్నెర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న వలస విధానం చాలా పాతది. ప్రతిభ ఆధారిత కోటా ద్వారా కేవలం 12శాతం మందికి మాత్రమే గ్రీన్కార్డులు జారీ చేస్తున్నాం. కానీ చాలా దేశాల్లో ఈ కోటా చాలా ఎక్కువగా ఉంది. కెనడాలో 53శాతం, న్యూజిలాండ్లో 59శాతం, ఆస్ట్రేలియాలో 63శాతం, జపాన్లో 52శాతం ఇస్తున్నారు. అందుకే అమెరికాలో దీన్ని 57శాతానికి పెంచాలని ట్రంప్ ప్రతిపాదించారు అని కుష్నెర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 17,2019 10:57AM