హైదరాబాద్: మధ్యప్రదేశ్ దామో జిల్లాలోని భతియాగర్ గ్రామానికి చెందిన ఇమ్రాత్ దేవి (25)ని పాము కరువగా, చికిత్స కోసం ఆమె దామో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. మహిళా వార్డులో ఆమె చికిత్స పొందుతుండగా, బంధువులు ఓ మంత్రగాడిని తెచ్చి వైద్యం చేయించే ప్రయత్నం చేశారు. ఆపై ఆమె చేత పురుషుల వార్డు బయట బట్టలు విప్పించారు. మంత్రగాడు కొన్ని మంత్రాలు చదువుతూ తన పని తాను చేసుకుపోయాడు. దీనిపై ఉన్నతాధికారులు మాట్లాడుతూ, ఓ నర్సు ఈ ఘటనను చూసిందని, కానీ ఆమె డాక్టర్లకు,సెక్యూరిటీ గార్డుకి సమాచారమివ్వలేదని అన్నారు. రోగులకు, వారి కుటుంబ సభ్యులకి మంత్రాలపై కౌన్సెలింగ్ ఇస్తున్నా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉండటం దురదృష్టకరమని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm