అమరావతి: ఆంధ్రుడిగా ఏపీ ప్రభుత్వంపై ఉత్తర భారత పార్టీలు చేస్తున్న దష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేశారన్నారు. గుజరాత్ను అభివృద్ధి చేసినట్లు ఏపీని కూడా అభివృద్ధి చేయాలని చలసాని డిమాండ్ చేశారు. పోలవరానికి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా ఏపీకి చాలా ఇచ్చామని చెప్తున్నారన్నారు. రాయలసీమకు రూపాయి కూడా ఇవ్వకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నిధులిస్తామని చెప్పండి హర్షిస్తాం కానీ... గుజరాత్లో చేశామని చెప్తే ఊరుకునేది లేదని చలసాని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం పోరాటం చేస్తున్నామన్నారు. ఉక్కు పరిశ్రమలను కేంద్రం ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇవ్వని పక్షంలో ముఖ్యమంత్రి పోరాటంలోకి రావాలన్నారు. నీటి విషయంలో ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm