హైదరాబాద్: కార్తికేయ కథానాయకుడిగా అర్జున్ జంధ్యాల గుణ 369 సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకి అనఘ పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి, ప్రధాన పాత్రధారులందరిని కవర్ చేస్తూ ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఆదిత్య మీనన్ నటిస్తుండగా, ఒక కీలకమైన పాత్రను మంజుభార్గవి పోషిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm