ఖమ్మం: త్యాగాల తెలంగాణలో ప్రైవేటు యూనివర్సిటీలు వద్దు అని ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి తాళ్ళ నాగరాజు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పీజీ కళాశాల ముందు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ విద్యను పేద విద్యార్థులకు దూరం చేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలకు పూనుకుంటుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు సిహెచ్. రమేష్, నాయకులు జమ్మి అశోక్, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm