హైదరాబాద్: బంగారు ఆభరణాలు దొంగతనం చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులు పిల్లలకు ఆశ చూపించి ఆభరణాలను దొంగలిస్తున్నారన్నారు. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హ్యాక్ ఐ యాప్తో మహిళలకు భద్రత పెరిగిందని సీపీ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm