న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. సంపాదనలోనే కాదు, సహాయం చేయడంలోనూ తాను స్టారే అని నిరూపించుకున్నారు. గతంలో నేపాల్ భూకంప, చెన్నై, కేరళ వరద బాధితులకు అధిక మొత్తంలో విరాళం ఇచ్చిన అక్షయ్.. తాజాగా అస్సాం వరద బాధితులకు రూ.2 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఇందులో కోటి రూపాయాలను అస్సాం ముఖ్యమంత్రి సహాయనిధికి, మరో కోటి రూపాయలను కజిరంగ నేషనల్ పార్క్కు విరాళంగా అందించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన అక్షయ్.. అస్సాంకు సహాయం చేయడానికి ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కాగా.. భారీ వర్షాలతో అస్సాం అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా దాదాపు 45 లక్షల మంది నిరాశ్రయులుకాగా అనేక మంది చనిపోయారు. యూనెస్కో గుర్తింపు పొందిన కజిరంగ నేషనల్ పర్క్ 90 శాతం నీట మునగడంతో అందులో ఉంటున్న మూగజీవాల పరిస్థతి దయనీయంగా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 18,2019 04:53PM