కృష్ణా: ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఘంటసాల మండలం వేములపల్లికి చెందిన కుటుంబం మచిలీపట్నంలో నివాసం ఉంటున్నారు. బాలుడు జతిన్ ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. అయితే చికిత్స కోసం విజయవాడకు తరలిస్తుండగా అంబులెన్స్ మొరాయించడంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి తల్లిదండ్రులు, బంధువులు అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm