న్యూఢిల్లీ: ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్కు నేడే చివరి రోజు. ఈ నెల 15న మొదలైన సేల్ నేటి అర్ధరాత్రితో ముగియనుంది. మొబైల్స్, ఎల్ఈడీ టీవీలు, స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై భారీ రాయితీలు ప్రకటించిన ఫ్లిప్కార్ట్ చివరి క్షణం కూడా పలు డిస్కౌంట్లు అందిస్తోంది. ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేసే వారికి అదనంగా పదిశాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.
ఫ్లిప్కార్ట్లో చివరి రోజు రెడ్మి నోట్ 7ఎస్ 3జీబీ ర్యామ్ం32 జీబీ స్టోరేజీ వేరియంట్ను రూ.9,999కే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.10,999. ఆనర్ 8సి మొబైల్ రూ.7,999కే అందుబాటులో ఉంది. బండిల్ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.7,350 వరకు తక్షణ రాయితీ లభిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.12,999. ఆనర్ 20ఐపై ఫ్లిప్కార్ట్ రూ.1000 రాయితీ అందిస్తోంది. పాత స్మార్ట్ఫోన్ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ఫోన్ను రూ.13,999కే సొంతం చేసుకోవచ్చు. రియల్ మి 3ప్రొపై రూ.500 తగ్గించి రూ.13,499కే అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్ 55 అంగుళాల 4కె స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ధర రూ.1,04,900 నుంచి ఏకంగా రూ.59,999కి దిగివచ్చింది. పాత టీవీ ఎక్స్చేంజ్పై రూ.18 వేల వరకు పొందవచ్చు. ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో పదిశాతం రాయితీ లభిస్తుంది. వీయూ 40 అంగుళాల ఫుల్హెచ్డి స్మార్ట్ ఎల్ఈడీ టీవీ రూ.16,999కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 27 వేలు. ఏసర్ నిట్రో 5స్పిన్ 15.6 అంగుళాల ల్యాప్టాప్ ధరను రూ.76,445 నుంచి రూ.50,990కి తగ్గించి విక్రయిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 18,2019 05:25PM