లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని సోంభద్ర జిల్లాలో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన వారి కుటుంబసభ్యులను శుక్రవారం పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఆ రాష్ట్ర పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకొని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చునార్ గెస్ట్హౌస్కు తరలించగా రాత్రి అక్కడే బసచేసిన ఆమె బాధిత కుటుంబాలను కలవకుండా వెనక్కి వెళ్లేది లేదని స్పష్టంచేశారు. పేదలకు ప్రజలకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగిన ప్రియాంక శనివారం ఉదయం మాట్లాడుతూ.. 24 గంటలు అవుతోంది. సోన్భద్ర కాల్పుల్లో మరణించిన బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు అనుమతించేదాకా ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లేది లేదని శపథం చేశారు. తమను కలిసేందుకు ప్రియాంక గాంధీని అనుమతించకపోవడంతో ఎట్టకేలకు బాధిత కుటుంబసభ్యులే చునార్ గెస్ట్హౌస్ వద్దకు వచ్చి ఆమెను కలిశారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు చెందిన ఇద్దరు బంధువులను మాత్రమే నన్ను కలిసేందుకు వచ్చారు. మరో 15 మంది నన్ను కలిసేందుకు వస్తే అనుమతించట్లేదు. కనీసం, నేను కూడా వారిని కలిసేందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 20,2019 12:57PM