బెంగళూర్: కర్నాటకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. గత రెండు రోజులుగా డ్రామాలో ఎన్నో కీలక మలుపులు తిరిగినా స్పీకర్ రమేష్ కుమార్ మాత్రం ప్రభుత్వాన్ని కాపాడుతూ వచ్చారు. బీజేపీ ఎంత ఒత్తిడి తెచ్చినా తమ అధికారాలు, చట్టాలతో స్పీకర్ గవర్నరు లేఖలను సైతం లెక్కచేయక విశ్వాసంపై చర్చ కొనసాగించారు. కాగా సోమవారం అసెంబ్లీలో ఓటింగ్ జరగని పక్షంలో గవర్నర్ ఏదొక నిర్ణయం తీసుకొనే ఆలోచనలో ఉండగా మరోపక్క ప్రభుత్వ భాగస్వామ్యాలు కాంగ్రెస్-జేడీఎస్ దేవెగౌడ ఇంట్లో రహస్య మంతనాలు చేస్తున్నాయి. రెబల్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి నిర్ణయం మార్చుకున్నారని, తనతో పాటు తన గ్రూపులోని మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా నిర్ణయం మార్చుకున్నారని, వారిని అసెంబ్లీకి రప్పించే మార్గం చూడాలని నేతలకు తెలిపినట్లుగా తెలుస్తుంది.
Mon Jan 19, 2015 06:51 pm