హైదరాబాద్ : ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 సిరీస్లో భారత షట్లర్ పీవీ సింధు జోరును కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో ప్రపంచ నెంబర్ టు ర్యాంకర్నొజోమి ఒకుహరా (జపాన్)ను 21-14, 21-7 తేడాతో చిత్తుగా ఓడించిన సింధు... సెమీస్లో సెకెండ్ సీడ్ చెన్ యు ఫీని ఓడించి ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఫిప్త్ సీడ్ సింధు గేమ్ ప్రారంభం నుంచి ఆధిక్యం ప్రదర్శించింది. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ అయిన చెన్ యుపై 21-19, 21-10తో వరుస సెట్లలో ఓడించి 46 నిమిషాల్లోనే విజయాన్ని అందుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్లో సింధు మూడో సీడ్ అకనె యమగుచి(జపాన్)తో తలపడుతుంది. కాగా, తొలి సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ తై జు యింగ్ను వరుస సెట్లలో మట్టి కరిపించిన యమగుచి ఫైనల్లో ప్రవేశించింది. కాగా, చెన్ యుతో 8సార్లు తలపడిన సింధు ఐదు సార్లు గెలుపొందడం విశేషం. ఇక, ఫైనల్లో తలపడబోయే యమగుచిపై సింధుకు మంచి రికార్డు ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm