హైదరాబాద్: బెనర్జీ, వెంకట్, ముమైతఖాన్, సంజీవ్కుమార్, సుమన్ రంగనాథన్ కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్ దర్శకత్వం తెరకెక్కిన సినిమా దండుపాళ్యం 4. ఈ సినిమాకు వెంకట్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఎన్ని అవాంతరాలు వచ్చినా ఖచ్చితంగా ఆగస్ట్ 15 విడుదల చేస్తామని చిత్ర దర్శకనిర్మాతలు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ చిత్రం దండుపాళ్యం ట్రయాలజీకి సీక్వల్ కాదని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమాలో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ రూపొందిందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm