బీజింగ్: చైనాకు చెందిన ఓ మహిళ కదిలే రైలును తన కాలితో ఆపబోయింది. ఈ ఘటన ఈ నెల 17వ తేదీన చైనాలో చోటు చేసుకుంది. ఈ రోజు ఆమె స్టేషన్కు రావడం కొద్దిగా లేటైంది. అలా ప్లాట్ఫాం మీదకి అడుగుపెట్టిందో లేదో ఇలా ట్రైన్ బయలుదేరడం ప్రారంభించింది. అప్పటికే వాటి తలుపులు కూడా మూసుకుపోయాయి. అయితే టైంకు ఆఫీసుకు చేరుకోవాలనే తొందరలో ఉన్న సదరు నారీ రత్నం..ఊహకందని పని చేసింది. ట్రైన్కు ప్లాట్ఫాంకు మధ్య ఉన్న స్థలంలో కాలు దూర్చి రైలు ఆపబోయింది. అయితే అదృష్టం కొద్దీ అక్కడ ఉన్న కాపలా వాళ్లు అప్రమత్తంగా ఉండటంతో..పెను ప్రమాదం జరిగేలోపే సదరు మహిళ చేతులు పట్టుకుని పక్కకు ఈడ్చేశారు. అనర్ధం జరిగేలోపే ఆమెను కాపాడారు. ఆ తరువాత సదరు మహిళను పోలీసులకు అప్పగించారు. రక్షక భటులేమో ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపిచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm