విజయనగరం : మరదలితో పెళ్లికి అత్తా మామలు నిరాకరించారన్న మనస్తాపంతో.. యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం కురుపాం మండలం, పిరంగూడ గ్రామంలో చోటు చేసుకుంది. పిరంగూడ గ్రామానికి చెందిన బిద్దిక రవి కుమార్ (20) అనే యువకుడు, మరదలితో పెళ్లికి అత్తా మామలు నిరాకరించారన్న మనస్తాపంతో.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే యువకుడిని భద్రగిరి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. నీలకంఠాపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm