హైదరాబాద్ : గత ఐదేళ్లుగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్గా కొనసాగిన ఈఎస్ఎల్ నరసింహన్ కు వీడ్కోలు పలికేందుకు ఏపీ సర్కారు సిద్ధమైంది. ఏపీకి బిశ్వభూషణ్ హరిచందన్ ను గవర్నర్ గా నియమించడంతో నరసింహన్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో, నరసింహన్ హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. భక్తిభావనలు మెండుగా ఉండే ఆయన బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో జ్ఞాపికలను బహూకరించారు.
Mon Jan 19, 2015 06:51 pm