అమరావతి: ఏపీ ప్రభుత్వం ఇవాళ ఆరు కీలక బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు, స్ధానికులకు పరిశ్రమల్లో 75శాతం కోటా కల్పన, మహిళలకు 50 శాతం నామినేటెడ్ పదవులు, 50 శాతం ప్రభుత్వ నామినేషన్ పనుల కేటాయింపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం నామినేటెడ్ పదవులు, 50 శాతం ప్రభుత్వ కాంట్రాక్టుల కేటాయింపు ఉన్నాయి. వైకాపా మేనిఫెస్టోలోని నవరత్నాల అమల్లో భాగంగా ప్రభుత్వం వీటిని సభలో ప్రవేశపెట్టింది.
Mon Jan 19, 2015 06:51 pm