అనంతపురం : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలోకి వెళితే... ద్విచక్ర వాహనం అదుపు తప్పి పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులలో శేఖర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి అశోక్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరు పెనుకొండలోని తోటగేరి కాలనీవాసులుగా గుర్తించినట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm