హైదరాబాద్: ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వాదనలు వినిపించారు. ఏ ప్రాతిపదికన పురాతన భవనాలను జాబితా నుంచి తొలగించారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. 22ఆఫ్ 2017 యాక్ట్ ప్రకారం ఎర్రమంజిల్ భవనం జాబితా నుంచి తొలగించారు. ప్రభుత్వ నిర్ణయాలపై పిటిషనర్ల ఆరోపణలో వాస్తవం లేదని అడిషనల్ ఏజీ చెప్పారు. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm