రాజస్థాన్ : ఇప్పటికీ తమ పార్టీకి అధ్యక్షుడు రాహుల్ గాంధీయేనని, రాబోయే రోజుల్లో కూడా ఆయనే మా నేత అని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. అయితే సీడబ్ల్యూసీ కొత్త అధ్యక్షుడ్ని ప్రతిపాదిస్తే ఎలా అని ప్రశ్నిస్తే మాత్రం సమాధానాన్ని ఆయన దాటవేశారు. బీజేపీని, మోదీని ఎదుర్కొనే ధైర్యం కేవలం రాహుల్కే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మతపరమైన భావోద్వేగాలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. బీజేపీ వాగ్దానాలను నమ్మి, ప్రజలు ఓటేశారని, ఒకవేళ వాగ్దానాలను నెరవేర్చక పోతే బీజేపీని అధికార గద్దె నుంచి దింపేస్తారని గెహ్లాట్ హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm