విజయనగరం: పెట్రోల్ బంకుల్లో యజమానులు, సిబ్బంది వాహనదారులను మోసగిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని తూనికల కొలతల అధికారి ఎస్ఎం రాధాకృష్ణ తెలిపారు. సోమవారం విజయ నగరంలోని పెట్రోల్ బంకును తనిఖీ చేశారు. ఓ బంకులో 5 లీటర్లకు గాను 40 ఎంఎల్ తక్కు వగా రావడాన్ని గమనించి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనచోదకులను మోసగిస్తే సహించేది లేదన్నారు. విని యోగదారులకు బంకుల్లో పెట్రోల్, డీజిల్ తక్కువగా వేస్తున్నట్టు అనుమానం వస్తే వెంటనే 9885828883 నంబర్కు సంప్రదించాలన్నారు. ఆయన వెంట ఏఎస్వో, సీఎస్డీటీ ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm