హైదరాబాద్: తమ డిమాండ్ల సాధనకు ఈ నెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ జేఏసీ కోరింది. సోమవారం ఆబిడ్స్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ కె.లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ సుభాకర్రావు, ఫైనాన్స్ సెక్రటరీ ఎస్.జ్ఞానేశ్వర్ తదితరులు మాట్లాడారు. జేఏసీలోని 25 సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుండా చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాజమల్లయ్య, ఎం.సూర్యనారాయణ,పీ కృష్ణమూర్తి, టీ సత్యనారాయణ, పీ పుండరీకాక్షరావు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm