జోగుళాంబ గద్వాల: ఇక గ్రామంలో మద్యం తాగబోమని, బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయించరాదంటూ గిరిజనులు ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పెద్దతండా ప్రజలు సోమవారం సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఇక మీదట ఎవరూ మద్యం తాగకూడదని, బెల్ట్షాపులు నిర్వహించరాదని తీర్మానం చేశారు. మద్యం తాగబోమని ప్రతిజ్ఞ చేశారు. 280 ఇళ్లు 1500 జనాభా కలిగిన ఈ గిరిజన తండా.. మద్యం జోలికి వెళ్లబోమని తీర్మానం చేయడం పట్ల సర్పంచ్ తాన్యానాయక్, మండల ఉపాధ్యక్షులు పెద్దవీరన్న ప్రజలను అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm