తూర్పు గోదావరి: జిల్లాలో కిడ్నాప్నకు గురైన బాలుడి మిస్టరీ ఇంకా వీడలేదు. మండపేట విజయలక్ష్మి నగర్లో నిన్న సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నాలుగేళ్ల జస్విత్ను కిడ్నాప్ చేశారు. ముసుగులు వేసుకొని వచ్చిన ఇద్దరు దుండగులు బాలుడిని ఎత్తుకెళ్లారు. కిడ్నాపర్ నుంచి తమకు ఎలాంటి ఫోన్ రాలేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తమ చిన్నారి కిడ్నాప్నకు గురవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm