న్యూఢిల్లీ: ఆమ్రపాలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ కంపెనీ అన్ని రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కంపెనీ డైరెక్టర్లపై మనీ లాండరింగ్ కేసులు నమోదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఆదేశించింది. గృహనిర్మాణాల కోసం వినియోగదారుల నుంచి సేకరించిన నిధులను ఇతర సంస్థల్లోకి మళ్లించారన్న అభియోగాలను ఆమ్రపాలి యాజమాన్యం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనిపై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. లావాదేవీలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఈడీకి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm