న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్శిటీగా పేరొందిన ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్యూ)లో ర్యాగింగ్ ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ పీహెచ్డీ చేస్తున్న ఒక స్కాలర్... సెంటర్ ఆఫ్ జర్మన్ స్టడీస్ చదువుకుంటున్న విద్యార్థిని ర్యాగింగ్ చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సీనియర్లు అతనిపై దాడిచేయడానికి తోడు గుంజిళ్లు తీయించారు. అలాగే అభ్యంతర కామెంట్లు చేశారు. దీనిపై బాధితుడు యూనివర్శిటీకి చెందిన యాంటీ ర్యాగింగ్ కమిటీకి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీహార్కు చెందిన విద్యార్థి రవిరాజ్ (బీఏ జర్మన్, ఫస్ట్ఇయర్) ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ... పీహెచ్డీ స్కాలర్ విజయ్ దహియా, అతని మరో ఇద్దరు స్నేహితులు తనను నిందించాడని తెలిపాడు. ముందుగా వారు తనను మీది బీహారా? అని అడిగారని, సమాధానం చెప్పినంతనే వారు ముగ్గురూ కలసి దాడి చేశారని తెలిపారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 23,2019 11:24AM