అమరావతి: నేడు ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్ వేటు పడింది. సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, బుచ్చయ్యనాయుడు, నిమ్మల రామానాయుడు ఉన్నారు. సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. అయితే ఈ సస్పెన్షన్ ఎత్తివేతపై టీడీపీ ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని వెళ్లి కలిశారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని సభ్యులు డిప్యూటీ స్పీకర్ను కోరారు. అచ్చెన్నాయుడు తన సీటులో కూర్చున్నా సస్పెండ్ ఎలా చేస్తారని సభ్యుల ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm