తూర్పుగోదావరి: జిల్లాలోని మండపేటలో బాలుడి కిడ్నాప్ ఘటనపై ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి ఆచూకీ కోసం ఏడు బృందాలు గాలిస్తున్నాయని ఎస్పీ అద్నాన్ నయీం తెలిపారు. బాలుడి తల్లిదండ్రుల బ్యాంకు వ్యవహారాల్లో ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కిడ్నాపర్ల నుంచి ఇప్పటివరకు ఎలాంటి డిమాండ్స్ రాలేదని చెప్పారు. కిడ్నాప్కు ముందు రెక్కీ నిర్వహించి ఉంటారని అనుమానిస్తున్నామని ఎస్పీ అన్నారు. వారం రోజుల ముందు నుంచి సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm