హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ముజాహిద్నగర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు చిన్నారులు కారులో ఊపిరాడక మంగళవారం రాత్రి మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజాహిద్నగర్కు చెందిన సయ్యద్ రియాజ్ (10), మహ్మద్ బద్రుద్దీన్(5) అనే ఇద్దరు చిన్నారులు మంగళవారం మధ్యాహ్నం ఆటాడుకుంటామని చెప్పి బయటకు వెళ్లారు. అయితే సాయంత్రం అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక ఒకటో టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా నిన్న రాత్రి సమయంలో అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి కారులో ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా కనిపించారు. కారులో వూపిరాడక చిన్నారులు మృతిచెంది ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm