బెంగళూరు: రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. బెంగళూరులో ఇవాళ రాష్ట్ర గవర్నర్ను మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడ్యూరప్ప కలవనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు యడ్యూరప్పను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం యడ్యూరప్ప పార్టీ సీనియర్ నేతలతో కలిసి గవర్నర్ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. కర్ణాటక అసెంబ్లిసలో నిన్న జరిగిన బలపరీక్షలో సీఎం కుమారస్వామి ఓడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం కుమారస్వామి గవర్నర్ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
Mon Jan 19, 2015 06:51 pm