న్యూఢిల్లి : పార్లమెంటు సమావేశాలను పది రోజులపాటు పొడిగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. సోమవారం జరిగిన బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశంలో పార్లమెంటు సమావేశాలను పొడిగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని లోక్సభలో కాంగ్రెస్ చీఫ్ విప్ కొడికున్నిల్ సురేష్ చెప్పారు. స్పీకర్ కూడా పొడిగింపు పట్ల సుముఖంగా లేరని, అయినా ప్రభుత్వం ఆయనపై ఒత్తిడి తీసుకువస్తున్నదని సురేష్ అన్నారు. సమావేశాలు దాదాపుగా నెల రోజులనుంచి జరుగుతున్నాయని, తాము తమ నియోజక వర్గాలతో సంబంధాలను కోల్పోతున్నామని ఆయన చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm