మేడ్చల్: శామీర్పేట్ పరిధి మజీద్పూర్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులు వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి కొమరవెల్లికి ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారు బల్కంపేట వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో వాహనాలు రెండూ నుజ్జయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm