హైదరాబాద్: పాత, కొత్త నేతల కలయికతో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ పదాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు, సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నడ్డా చర్చించారు. ఈ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర సహాయమంత్రి కిషన్రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్తో పాటు నేతలు డీకే అరుణ, జితేందర్రెడ్డి, పొంగులేటి సుధాకర్రెడ్డి, బాబూమోహన్ తదితరులు హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm