హైదరాబాద్: ముంపు బాధితుల దీనపరిస్థితిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. ఈ రోజు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో మనసుకు హత్తుకున్న సన్నివేశమంటూ ట్విట్టర్లో ఒక ఫోటోను కేశినేని నాని పోస్ట్ చేశారు. వరదల్లో ఇల్లు మునిగితే ఇంటి పైకప్పును వంట గట్టు చేసుకుని ఓ తల్లి వంట చేసిదంటూ ట్వీట్ చేశారు. ఇంటి పైకప్పుపైనే ఆకలి తీర్చుకుంటూ మాకు కూడా అన్నం పెట్టిన పిల్లవాడు, ఈ దాతృత్వం దానగుణం ఎంతటి కష్టమైన ఎదుర్కునే తత్వం కేవలం పేద వారికే స్వంతం అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm