హైదరాబాద్: కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం విరుపాపురం గ్రామానికి చెందిన న్యాయమూర్తి దేవదాసు (43) విద్యుద్ఘాతంతో మృతి చెందారు. పత్తికొండ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గా విధులు నిర్వహిస్తున్న దేవదాసు.. నూతన గృహ నిర్మాణం జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ క్యూరింగ్ చేసేందుకుగాను నీళ్ల కోసం మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్ వైరు ఆయనకు తగిలింది. దీంతో దేవదాసు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm