జగిత్యాల: టీఆర్ఎస్, బీజేపీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ అవినీతి బీజేపీకి ఐదేళ్లకు గుర్తొచ్చిందా? అని జీవన్రెడ్డి ప్రశ్నించారు. బీజేపీకి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ మీద సీబీఐ ఎంక్వయిరీ వేసే దమ్ము బీజేపీకి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. అవినీతి నిరూపించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పరస్పరం కొట్టినట్లు, తిట్టినట్లు నాటకాలడుతున్నాయన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ముసుగులో రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ాాబిల్లుల ఆమోదానికి టీఆర్ఎస్ సహకరించలేదా? భగీరథ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రాలేదా ?్ణ్ణ అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తమకు ప్రత్యామ్నాయం ఎవరో టీఆర్ఎస్, బీజేపీలే తేల్చుకోవాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm