రంగారెడ్డి: రాజేంద్రనగర్ పరిధిలో హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా నుండి హైదరాబాద్ కు వస్తున్న లారీని ఆపిన అధికారులు తనిఖీలు నిర్వహించి భారీ మొత్తంలో గుట్కాను గుర్తించారు. లారీలో ఉన్న సుమారు రూ.50 లక్షల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేశారు. విజిలెన్స్ అధికారులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm