చెన్నై: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో అపరాధిగా ఉన్న నళిని శ్రీహరన్ తన పెరోల్ను మరో నెల పాటు పొడిగించాలని మద్రాస్ హైకోర్టును మంగళవారం ఆశ్రయించింది. జీవిత కాల శిక్షను అనుభవిస్తున్న నళినికి జులై 25న నెల రోజుల పెరోల్ను కోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తన కుమార్తె పెళ్లికి ఏర్పాట్లు పూర్తి కాలేదని.. అందువల్ల మరో నెల రోజుల పెరోల్కు అనుమతినివ్వాలని మద్రాస్ హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. తన కుమార్తె లండన్లో ఉందని.. సెప్టెంబర్ తొలి వారంలో ఆమె ఇండియాకు వస్తుందని.. ఆమె వచ్చాక పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టాలని భావిస్తున్నందు వల్ల పెరోల్ను పొడిగించాలని పిటిషన్లో నళిని పేర్కొంది. జైలు ఉన్నతాధికారులు తన అభ్యర్థనను తిరస్కరించడంతో నళిని కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. గురువారం లోపు రాష్ట్ర ప్రభుత్వం సమాధానమివ్వాలని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎమ్ నిర్మల్ కుమార్తో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm