హైదరాబాద్ : ఒప్పోకు చెందిన సబ్బ్రాండ్ రియల్మి తన నూతన స్మార్ట్ఫోన్ రియల్మి 5 ను ఇవాళ భారత మార్కెట్లో విడుదల చేసింది. క్రిస్టల్ బ్లూ, క్రిస్టల్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో విడుదలైన ఈ ఫోన్కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.10,999 గా ఉంది. అలాగే 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.11,999గా నిర్ణయించారు. ఈ ఫోన్లను ఈ నెల 27వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్, రియల్మి ఆన్లైన్ స్టోర్స్లో ఎక్స్క్లూజివ్గా విక్రయించనున్నారు. రియల్మి 5 స్మార్ట్ఫోన్లో.. 6.5 ఇంచుల డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్లస్ పొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. కాగా ఈ ఫోన్పై జియో తన కస్టమర్లకు రూ.7వేల విలువైన ప్రయోజనాలను అందివ్వనుంది. అలాగే రూ.750 విలువైన, రూ.20వేల ప్రయోజనాలతో కూడిన పేటీఎం మెంబర్షిప్ ఉచితంగా వస్తుంది.
Mon Jan 19, 2015 06:51 pm