హైదరాబాద్: ఈబిజ్ ఎండీ పవన్ మల్హన్, ఆయన కుమారుడు హిటిక్ మల్హన్లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో చైన్ సిస్టమ్ ద్వారా ఈ బిజ్ మోసం చేసిందని కేపీహెచ్బీ, మాదాపూర్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చైన్ సిస్టమ్ ద్వారా దేశవ్యాప్తంగా రూ.5 వేల కోట్ల మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీలో పవన్, హిటిక్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చారు. న్యాయస్థానంలో నిందితులను హాజరుపర్చిన పోలీసులు అనంతరం చర్లపల్లి జైలుకు రిమాండ్కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm