హైదరాబాద్ : బంగారం ధర రోజు రోజుకీ కొత్త గరిష్ఠాలను చేరుతోంది. పది గ్రాముల పసిడి రూ.40వేలకు చేరువగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాటి బులియన్ ట్రేడింగ్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.200 పెరిగి, రూ.38,770 వదకద ఆల్టైం రికార్డు స్థాయి ధరను నమోదు చేసింది. ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గకపోవడంతో పసిడి ధర అంతకంతకూ పెరుగుతోందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ఏకంగా రూ.1,100 తగ్గి రూ.43,900లకు చేరింది.
Mon Jan 19, 2015 06:51 pm