అమరావతి: అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహరంపై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పందించారు. ఫర్నిచర్ తరలింపుపై కొన్ని మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్ తరలిస్తుండగా కొంత ఫర్నిచర్ను నా కార్యాలయంలో వినియోగించుకున్నానని తెలిపారు., గతంలో అనేకసార్లు అసెంబ్లీ అధికారులకు లిఖిత పూర్వకంగా లేఖలు రాశానని చెప్పారు. ఫర్నిచర్ను తీసుకువెళ్ళాలని కోరా...స్పందించలేదని కోడెల అన్నారు. ఇప్పటికైనా అసెంబ్లీ అధికారులు వస్తే ఫర్నిచర్ను అప్పగిస్తా...లేదంటే ఎంత ఖర్చు అయ్యిందో చెబితే చెల్లిస్తానని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm