న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్కు భారీ ఊరట లభించింది. 2013లో ఐపీఎల్ సీజన్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్ సహా అజిత్ చండేలా, అంకిత్ చవాన్పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ శ్రీశాంత్ ఏళ్ల తరబడి చేసిన పోరాటం ఇన్నాళ్లకు ఫలించింది. అతడిపై విధించిన నిషేధం ఏడేళ్ల కాలానికే పరిమితమని బీసీసీఐ అంబుడ్స్మన్, విశ్రాంత న్యాయమూర్తి డీకే జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధం విధించి ఇప్పటికే ఆరేళ్లు అయింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. వచ్చే ఏడాది ఆగస్టుతో ఏడేళ్ల నిషేధం ముగుస్తుంది. అప్పటి నుంచి అతడిపై ఉన్న బంధనాలు తొలగిపోనున్నాయి. 36 ఏళ్ల శ్రీశాంత్ నిషేధం పూర్తికాగానే కేరళతోపాటు విదేశీ లీగుల్లోనూ శ్రీశాంత్ ఆడనున్నాడు. భారత జట్టు తరపున శ్రీశాంత్ 53 వన్డేలు, 27 టెస్టు మ్యాచ్లు, పది టీ20లు ఆడాడు. బౌలింగ్లో 169 వికెట్లు పడగొట్టాడు. 2011లో చివరిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
Mon Jan 19, 2015 06:51 pm