ఎడపల్లి: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడిపై అదే గ్రామానికి చెందిన మరో బాలుడు (17) లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆరేళ్ల బాలుడిని ఇంటికి పిలిచి ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని బాలుడు తన తల్లిదండ్రులకు చెప్పాడు. బాలుడి తల్లితండ్రులు ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎడపల్లి పోలీసులు పోక్సో చట్టం కింద 17 ఏళ్ల బాలుడిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై ఆ బాలుడి తల్లిదండ్రుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm