ఇస్లామాబాద్: జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దాయాది దేశం పాకిస్థాన్ అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకుందని అక్కడి మీడియా మంగళవారం వెల్లడించింది. మేం కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. అన్ని న్యాయపరమైన అవకాశాలను పరిశీలించిన మీదట ఈ నిర్ణయానికొచ్చాం అని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వెల్లడించినట్లు అక్కడి మీడియా పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm