భోపాల్: ఉగ్రవాద కదలికల సమాచారంతో మధ్యప్రదేశ్లోని ఎనిమిది జిల్లాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఆఫ్గనిస్థాన్కు చెందిన నలుగురు ఉగ్రవాదులు రాష్ట్రంలోకి చొరబడ్డారన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. గుజరాత్, రాజస్థాన్తో సరిహద్దు పంచుకొనే జిల్లాల్లో వీరు నక్కి ఉండొచ్చని భావిస్తున్నారు. జాబువా, అలీరాజ్పూర్, ధార్, బార్వాణీ, రత్లామ్, మంద్సౌర్, నీముచ్, అగర్-మాల్వా జిల్లాల్లో ఉగ్రవాదుల కోసం తీవ్ర స్థాయిలో గాలింపు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm