హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం అరెస్టుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. చట్టం ప్రకారమే కోర్టు నిర్ణయం తీసుకుంటుందన్నారు. చిదంబరం అరెస్టులో పార్టీ కానీ, ప్రభుత్వం ప్రమేయం ఏమీలేదన్నారు. అవినీతికి పాల్పడిన వ్యక్తులను శిక్షించాలన్న అంశాన్ని ప్రభుత్వాలు నిర్ణయించవని, అవి కోర్టులే చూసుకుంటాయని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాజకీయ పెద్దలను సంతోషపెట్టేందుకు చిదంబరాన్ని అరెస్టు చేశారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా ఆరోపించారు. ప్రతీకారేచ్ఛతోనే అరెస్టు చేశారన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని సీబీఐ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm